28.7 C
Hyderabad
April 27, 2024 03: 04 AM
Slider మహబూబ్ నగర్

ప్రజా ఫిర్యాదులపై సత్వర పరిష్కారం

#prajavani

శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి  బాధితులకు అండగా ఉంటు  ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహబూబ్  నగర్ జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన  13 ప్రజా ఫిర్యాదులను  జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను  ఎస్పీ ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ  చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

Related posts

ప్రకృతి వనాన్ని సందర్శించిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి

Satyam NEWS

సెప్టెంబర్‌ రెండో వారంలో గ్రాండ్‌గా రాబోతున్న ‘నరకాసుర’

Satyam NEWS

ఈనెల 17కు హాజీపూర్ హత్యల కేసు విచారణ వాయిదా

Satyam NEWS

Leave a Comment