సోమవారం వనపర్తి పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఏడుగురు ఫిర్యాదు దారులు వచ్చారు.
ఫిర్యాదు దారులతో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
నేడు పోలీసులకు అందిన ఫిర్యాదుల్లో మూడు భూ సంబంధిత ఫిర్యాదులు కాగా రెండు భార్యాభర్తల తగాదాలు, మరో రెండు పరస్పర గొడవల ఫిర్యాదులు ఉన్నాయి.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి