33.7 C
Hyderabad
April 29, 2024 02: 36 AM
Slider కృష్ణ

వివాహిత మృతి: భర్తపైనే అనుమానం

therisa death

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. మూడో నెల గర్భిణి అయిన ఒక వివాహిత అర్ధంతరంగా మరణించింది. బర్రె మదర్ తెరిసా(22 ) నాగేశ్వరరావు (28 ) వీరిద్దరు  మూడు సంవత్సరాల  క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన నాటి నుండి  భీమవరంలో జీవనం సాగిస్తున్న వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె గర్భవతి. ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు చెబుతున్నా భర్తే హత్య చేశాడని మదర్ తెరిసా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహం అయిన తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని కూడా వారు అంటున్నారు.

తననే నమ్ముకుని వచ్చిన భార్యను జీవితాంతం భద్రతతో చూసుకోవాల్సిన భర్తే చంపేస్తాడని తాము కూడా ఊహించలేదని వారు అంటున్నారు. మృతురాలి తల్లి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన తో ఆప్రాతం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

శశిథరూర్‌ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Satyam NEWS

BJYM ఆధ్వర్యంలో బిచ్కుంద మండలలో నిరసన కార్యక్రమం

Satyam NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment