ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. కలెక్టర్ తో మాట్లాడి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఒంగోలు ప్రస్ క్లబ్ సాధన సమితి సభ్యులు నేడు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు గురించి మరోమారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులు శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు పలు మార్లు అడిగారని తెలిపారు. నేడే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అందుకు అవసరం అయిన చర్యల తీసుకుంటానని కలిసిన ప్రెస్ క్లబ్ సాధన సమితి సభ్యులకు స్పష్టం చేశారు. ఈ మేరకు జర్నలిస్ట్ మిత్రులు మంత్రి బాలినేనికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సీనియర్ ఫోటో గ్రాఫర్ కొమ్మూరి శ్రీనివాస రావు కు CM రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేయిస్తానని హామీ ఇచ్చారు.
previous post