28.7 C
Hyderabad
April 26, 2024 08: 38 AM
Slider పశ్చిమగోదావరి

ప్రాధమిక విద్యే పిల్లలకు బలమైన పునాది

#GRajManoj

పూర్వ ప్రాధమిక విద్యే అంగన్వాడీ బాలలకు బలమైన పునాది అని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ జి.రాజ్ మనోజ్ అన్నారు. శనివారం ఆయన పెదవేగి గ్రామంలోని ఎస్ సి ఏరియాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎం డి ఓ బాలలతో కొద్దిసేపు వారి నోటి నుంచి వచ్చే చిన్ని చిన్ని మాటలు విన్నారు. బాలలు చెప్పిన కొన్ని పొడుపుకథలు, ముచ్చట గొలిపే కొన్నిపాటలు బాలలు ఎం డి ఓ కి వినిపించారు.

ఆటపాటలతో కూడిన విద్య బాలల వికాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అంగన్వాడీ ద్వారా బాలలకు అందుతున్న పోషకాహారం, నెల నెలా వారి ఎదుగుదల, అంగన్వాడీ టీచర్ బాలలకు నేర్పుతున్న ఆటలు పాటలు పై బాలలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ అందిస్తున్న మెనూ వివరాలను ఆడిగితెలుసుకుని ఎం డి ఓ రాజ్ మనోజ్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts

కొత్త జిల్లాల ఏర్పాటు ఒక సువర్ణాధ్యాయం

Satyam NEWS

భోగి రోజు మహిళలతో ఆడిపాడిన అంబటి రాంబాబుకు కరోనా

Satyam NEWS

పాలన చేతగాని అసమర్థ సీఎం వై ఎస్ జగన్: చదలవాడ విమర్శ

Satyam NEWS

Leave a Comment