కడప జిల్లా రాజంపేటలో కృష్ణా రెడ్డి చైతన్య చిల్డ్రన్స్ విద్య సంస్థల భవనాన్ని బుధవారం జిల్లా సహకార మార్కెటింగ్ సంఘo జిల్లా అధ్యక్షులు దండు గోపి బిజినెస్ మేనేజర్ లు సీజ్ చేసారు. రాజంపేట పట్టణంలోని పాత స్టేట్ బ్యాంక్ భవనాన్ని కృష్ణా రెడ్డి చైతన్య చిల్డ్రన్స్ విద్యా సంస్థల వారు అద్దెకు తీసుకొన్నారు.
గత కొంత కలంగా కడప జిల్లా సహకార మార్కెటింగ్ సంఘo వారికీ సరి అయిన సమాధానం చెప్పక, అద్దె చెల్లించక పోవడంతో బుధవారం కడప జిల్లా సహకార మార్కెటింగ్ సంఘo జిల్లా అధ్యక్షులు దండు గోపి బిజినెస్ మేనేజర్ సిబ్బంది రాజంపేట డి.ఎస్.పి నారాయణ స్వామి రెడ్డి,పట్టణ సిఐ శుభ కుమార్ లకు పిర్యాదు చేసి అ భవనానిన్ని సీజ్ చేసారు.
జిల్లా అధ్యక్షులు దండు గోపి మాట్లాడుతూ ప్రవేటు విద్యా సంస్థ వారు 28 లక్షల రూపాయలు అదే బకాయిలు చెల్లించ కూడా సాకులు చెబుతూ ,చెల్లని చెక్కులు ఇచ్చారని వారిపై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశామని తెలిపారు.