క్రికెట్ లో గెలుపొందిన ప్రైజ్ మనీని బాలికల అనాధ బాల సదనంకు అందచేసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదర్శంగా నిలిచారు.
ఇటీవలే నాగర్ కర్నూల్ పట్టణంలో యంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్నేహపూర్వక క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో కలెక్టర్ లెవెల్ జట్టు ద్వితీయ విజేతగా నిలిచింది. దీనికి గాను ప్రైజ్ మనీగా రూ.30 వేల రూపాయలను అందించారు.
ఈ డబ్బును అచ్చంపేట పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ బాలికల బాల సదనం కు జిల్లా కలెక్టర్ శర్మన్ విరాళంగా ఇచ్చేశారు.
ప్రైజ్ మనీగా గెలుపొందిన 30 వేల రూపాయల చెక్కును సోమవారంనాడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రజ్వల కు కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ మను చౌదరి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ లెవెల్ క్రికెట్ జట్టు సభ్యులు జగదీష్ హర్షత్, నరేష్ సంపత్ పాల్గొన్నారు.