రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్లుగా పనిచేస్తున్న వారికి ఇటీవల ప్రభుత్వం సీనియార్టీ ప్రకారం 81 మందికి ఆర్డీఓ (డిప్యూటీ కలెక్టర్) గా ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమోషన్ లిస్టులో సూర్యాపేట జిల్లాకు చెందిన 5గురు తహసీల్దార్లకు చోటు దక్కింది.
అందులో హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ లో గరిడేపల్లి మండల తాహశీల్దార్ జె. కార్తికేయకు, మేళ్లచెరువు మండల తాహశీల్దార్ కె.దామోదర్ తో పాటు సూర్యాపేట కలెక్టరేట్ లో అడ్మినిస్ట్రేట్ అధికారి (ఏ.ఓ)గా పనిచేస్తున్న వి. శ్రీదేవికి, అలాగే చిలుకూరు మండల తహశీల్దార్ గా పనిచేస్తున్న ఎం.రాజేశ్వరి, తిరుమలగిరి మండల తాహసీల్దార్ రమణారెడ్డిలు ప్రమోషన్లు పొందారు. ప్రమోషన్ పొందిన తాహసిల్దార్లకు అధికారులకు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.