ప్రజా రాజధానిని పాడుపెట్టిన వైసీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాజధాని రైతులు గత 200 రోజులుగా చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా నరసరావుపేట టీడీపి ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న రాజధాని అమరావతి అని అన్నారు.
అయితే వైసీపీ నాయకులు కుట్రతో రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరించి రాజధాని మార్చడంపై 200 రోజులుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదని ఆయన అన్నారు.