30.7 C
Hyderabad
April 29, 2024 03: 22 AM
Slider ఖమ్మం

సామాజిక సేవలో పిఎస్ఆర్ ట్రస్ట్

#PSR Trust

సామాజిక సేవకు పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ అం కితమై పని చేస్తుందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిశ పుల్లయ్య తేలిపారు సామాజికంగా సేవలు చేయడమే కాకుండా సేవలు అందించే వారికి ట్రస్ట్ దన్నుగా నిలుస్తుందన్నారు. శనివారం ఖమ్మం బైపాస్ రోడ్డులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (మామిళ్లగూడెం)కు పరిశ

సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా పరిశ పుల్లయ్య మాట్లాడుతూ విద్య సామాజిక అభివృద్ధికి ట్రస్ట్ కృషి చేస్తుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు విధాలుగా ఆరోగ్య పరమైన సేవలను అందిస్తున్నారని సేవలు అందించిన సిబ్బంది అభినందనీయులన్నారు. వైద్యో నారాయణో హరి అన్నట్లుగా అనేక మంది ప్రాణాలను కాపాడుతున్న వైద్య సంస్థలకు సహకారం అందించే అవకాశం రావడం ఎంతో

సంతోషదాయకమన్నారు. మున్ముందు కూడా మరిన్ని సేవలను ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, అరసం జిల్లా బాధ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, మాజీ ఎంపిపి యర్రా బాబు, సిబ్బంది డాక్టర్ నాగమణి, డాక్టర్ హరినాథబాబు, సంధ్యారాణి, లక్ష్మీ, శ్రావణి, పద్మ, రాజేశ్వరి, హేమలత, చంద్రమణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరవీరుల కుటుంబ సభ్యులకు అండ గా వుంటాం

Murali Krishna

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

Bhavani

కడపలో ఉన్నారా? మీకు కరోనా వస్తే ఇక అంతే…..

Satyam NEWS

Leave a Comment