హైదరాబాద్ పబ్బుల్లో మందు బాబుల ఆకృత్యాలు రోజు రోజు కు మితి మీరుతున్నాయి. శనివారం రాత్రి ఒక రోజే మూడు సంఘటనలు పబ్బు ల లో జరుగుతున్నా ఆగడాలకు అడ్డం పడుతున్నాయి. ఒక సంఘటన బేగం పేట లో జరగ్గా మరో రెండు సంఘటనలు ఎల్బీనగర్ లోనూ జరిగింది. నాగోల్ ప్రాంతంలోని ఓ హోటల్ కు వచ్చిన కొందరు గొడవకు దిగి, హోటల్ యజమాని బైక్ ను గ్రానైట్ రాయితో ధ్వంసం చేశారు
బేగంపేటలోని ఓ పబ్బు లో మందు కొట్టిన కొంతమంది, ఓ అమ్మాయిని ఏడిపించడంతో పాటు, పబ్బుపై దాడి చేసి, అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన పబ్ యజమానిపైనా దాడి చేశారు.
పంజాగుట్ట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పబ్బుకు వచ్చిన కొందరు యువకులు పూటుగా తాగి అదే పబ్ కు ఒంటరిగా వచ్చిన యువతిని వేధించారు. ఆమెను వెంబడిస్తూ నానాయాగీ చేశారు. దీనిపై ఆమె పబ్ మేనేజర్ కు ఫిర్యాదు చేయగా, మేనేజర్ వారించబోగా యువకులు రెచ్చిపోయారు.
విధ్వంసం సృష్టించారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం తో అతనిపైనా దాడి చేశారు. పోలీసులు వచ్చి దాడికి పాల్పడిన యువకుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి మరో రెండు సంఘటనలు ఎల్బీనగర్ లోనూ జరగగా, నాగోల్ ప్రాంతంలోని ఓ హోటల్ కు వచ్చిన కొందరు గొడవకు దిగి, హోటల్ యజమాని బైక్ ను గ్రానైట్ రాయితో ధ్వంసం చేశారు. దీనిపై అతను ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.