బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామ రైతు సహకార సంఘం చైర్మన్గా ఇటీవలే గెలుపొందిన ఇందిరా ప్రహ్లాదు దేశాయి బుధవారం పాలకవర్గ సభ్యులు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
అనంతరం జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ సిండే పాలకవర్గ సభ్యులకు సన్మానం చేశారు. పుల్కల్ సహకార సంఘానికి అన్ని విధాలుగా అభివృద్ది పరిచేందుకు తాను సహకరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపిపి అశోక్ పటేల్, జెడ్పీటిసి భారతి రాజు, వైస్ చైర్మన్ రామిరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి, వైస్ ఎంపిపి రాజు పటేల్, బిచ్కుంద సొసైటి చైర్మన్ బాలాజీ, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, సొసైటి కార్యదర్శి శ్రీనివాస్ సొసైటీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.