తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న డాన్బాస్ను రక్షించేందుకు ‘మిలిటరీ ఆపరేషన్’ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ను సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి, కీవ్ పాలనలో ప్రజలను ‘బాధలు, మారణహోమం’ నుండి రక్షించడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించబడిందని పుతిన్ చెప్పారు. “నేను ఒక ప్రత్యేక సైనిక చర్యను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాను. కీవ్ పాలనలో ఎనిమిదేళ్లుగా మారణహోమానికి గురవుతున్న ప్రజలను రక్షించడం దీని లక్ష్యం. దీని కోసం మేము ఉక్రెయిన్లో సైనికీకరణ, డి-నాజిఫికేషన్ లక్ష్యంగా పెట్టుకుంటాం.” అని పుతిన్ తెలిపారు. “మా దేశాన్ని, ప్రజలను బెదిరించడానికి లేదా అడ్డంకులు సృష్టించడానికి ఎవరైనా జోక్యం చేసుకుంటే రష్యా చూస్తూ ఊరుకోదు. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని పరిణామాలను చూడాల్సి వస్తుందని తెలుసుకోవాలి.” అని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ విడిపోయిన ప్రాంతాలకు రష్యా సాయుధ బలగాలను పంపాలని కూడా పుతిన్ ఆదేశించారు. తమ దేశం రష్యాకు ముప్పు కలిగిస్తోందన్న వాదనలను ఉక్రేనియన్ అధ్యక్షుడు ఖండించారు. రష్యా దండయాత్ర పదివేల మంది ప్రాణాలను బలిగొంటుందని ఆయన హెచ్చరించారు. మాస్కో ఉక్రెయిన్పై దాడి చేస్తే పుతిన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని అమెరికా హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) అత్యవసర సమావేశం జరిగింది. ఉక్రెయిన్ విడిపోయిన ప్రాంతాల అధిపతులు డోనెట్స్క్, లుహాన్స్క్ రష్యా అధ్యక్షుడిని సహాయం కోరిన తర్వాత ఉక్రెయిన్ అత్యవసర UNSC సమావేశాన్ని అభ్యర్థించింది.