సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.
మొత్తం 11 ఛార్జిషీట్లలో జగన్ ఏ1గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.