తెలంగాణ లో మరో చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్గొండ జిల్లా నాగర్జునసాగర్ హిల్ కాలనీ లో రవి (30) అనే చిరుద్యోగి ఈ పని చేశాడు.
వృత్తిరీత్యా డివైన్ మెర్సీ స్కూల్లో టీచర్ గా అతను పని చేస్తున్నాడు.
కరోనా కారణంగా ప్రైవేట్ స్కూల్లో జీతాలు ఇవ్వడం లేదు. దాంతో అతనికి కుటుంబ పోషణ భారమైంది. గత రాత్రి భార్య భర్తలు ఇరువురు ఇదే విషయంపై గొడవ పడ్డారు.
దాంతో భార్య ఇల్లు విడిచి పోవటంతో మనస్థాపం చెంది రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి ఇద్దరు సంతానం.