జగన్ సర్కార్పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేగాక తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘మొన్న ఒక వైఎస్ రెడ్డి.. నిన్న రామిరెడ్డి అట. రాజీనామా చేయి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు.
నా ఇంటి దగ్గరకు వస్తే సీఆర్పీఎఫ్ వాళ్లు షూట్ చేసేస్తారు. ఏంట్రా రాజీనామా చేసేది. మీరు చేయండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీ కేర్ ఫుల్. ప్రజామోదంతో నేను నెగ్గా. ఏంట్రా రాజీనామా చేసేది. యూజ్ లెస్ ఫెలోస్.. మీరు చేయండి. అమరావతి అక్కడే ఉంటుందంటూ అబద్దాలు ఆడారు.
రేయ్ గూబ పగులుద్ది. నా విజయంలో జగన్ 90 శాతం కారణం అయితే, నా బొమ్మతో కూడా నేను నెగ్గా. రాజీనామా చేయనని చెబుతున్నా… వెధవల్లారా. నన్నెవరైతే బెదిరించారో.. ఆ వెధవలకే చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి.. నా జోలికి రాకండి. మీ పరిధిల్లో మీరు ఉండండి.
మీ ఏడుపు ఏంట్రా.. పనికి మాలిన వెధవల్లారా. నాకు రోజూ వంద కాల్స్ వస్తాయి. రాజీనామా.. రాజీనామా అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడకండి. పాపులు శిక్షించబడుదురు. నాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదుపై ఎవరూ స్పందించడం లేదు.
లోకాయుక్తలో కూడా పిటిషన్ దాఖలు చేశాను. చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఎవరూ స్పందించలేదు. లోకాయుక్త కూడా పట్టించుకోకపోతే చేయాల్సింది చేస్తాను. గోరులు సరిపోవు.. గొడ్డలే కావాలంటే అలాగే చూద్దాం’’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.