సిరిసిల్లా జిల్లా వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బొడుసు రాజేందర్ (46) కరోనా కారణంగా మరణించారు.
గత కొద్ది రోజులుగా ఆయన కు కరోనా సోకడంతో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన మంగళవారంనాడు తుది శ్వాస విడిచారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజేందర్ మృతి చెందడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ సందర్భంగా పలువురు ఆలయ సిబ్బంది ,రాజకీయ నాయకులు, బంధుమిత్రులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.