40.2 C
Hyderabad
April 28, 2024 18: 25 PM
Slider ప్రత్యేకం

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్

#mlarajasingh

బ్లాక్ మెయిలర్ గా పేరున్న రేవంత్ రెడ్డికి బీజేపీపై, దేవుడిలాంటి నరేంద్రమోడీపై ఆరోపణలు చేసే అర్హత లేదన్నారు….తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్. తెలంగాణ ఏర్పడిందే బీజేపీ మద్దతుతో అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ అన్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు.. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో.. బీజేపీ పాత్ర కూడా అంతే ఉందన్నారు. అందుకే తెలంగాణ సమాజం నరేంద్రమోదీని, బీజేపీని ఆశీర్వదిస్తోందన్నారు… బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.రేవంత్ రెడ్డి లాంటి నీచ రాజకీయాలు చేసేవాళ్లు మోదీపై ఏదో చెబితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.రాజకీయాల్లో ఊసురవెల్లి కంటే కూడా వేగంగా రంగులు మార్చే నైజం రేవంత్ రెడ్డిదనే విషయం తెలంగాణ సమాజానికి తెలుసునని అన్నారు.సోనియాగాంధీని బలి దేవత అని విమర్శించింది రేవంత్ రెడ్డి కాదా? కాంగ్రెస్ పై అత్యంత హీనంగా ఆరోపణలు చేయలేదా? ఈరోజు సోనియాగాంధీ దత్త పుత్రుడిలాగా మాట్లాడితే నమ్మేదెవరు అని సూటిగా ప్రశ్నించారు… ఎమ్మెల్యే రాజాసింగ్.సోనియాగాంధీపై ఈడీ కేసు ఉంది. ఆ కేసు విచారణకు పిలిస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంది అని ఘాటు గానే వ్యాఖ్యానించారు.

ఒకవేళ సోనియాగాంధీ కడిగిన ముత్యమైతే విచారణ అనంతరం అదే స్వచ్ఛతతో బయటకు వస్తారు కదా? అని అన్నారు.ఈడీ విచారణకు పిలిచారనగానే కాంగ్రెస్ నేతలు గాయి గాయి ఎందుకు చేస్తున్నారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్కక్కయ్యారు కాబట్టే ఓటుకు నోటు కేసు ముందుకు పోకుండా ఆగిపోయింది. అందుకే కేసీఆర్ అరాచక పాలనను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు.

అక్బరుద్దీన్ ఒవైసీపై ఉన్న కేసుకు సంబంధించి సరైన ఆధారాలు ఇవ్వకుండా ఏ విధంగా నీరుగార్చారో.. రేవంత్ రెడ్డి కేసును కూడా అదే విధంగా నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని… అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు బయటకు వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

కేసీఆర్ అరాచక పాలనపై రాష్ట్రంలో పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని… కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వాళ్లు ఎవరైనా బీజేపీలోకి వస్తారని స్పష్టం చేశారు.రేవంత్ రెడ్డి తన అసమర్ధతను, బ్లాక్ మెయిల్ మనస్తత్వాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.మరోసారి బీజేపీ జోలికొస్తే ఖబర్దార్… రేవంత్ రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు…తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్.

Related posts

టీబీ నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రానికి మూడు పతకాలు

Satyam NEWS

మజ్లీస్ బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న అగాధం

Bhavani

Way2news పై అనంతపురం పోలీసుల చర్యలు

Bhavani

Leave a Comment