31.7 C
Hyderabad
May 2, 2024 09: 48 AM
Slider కరీంనగర్

కరోనా రోగుల్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి

#KowshikReddy

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు.

అనంతరం కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ దవాఖానాలను ఆయన సందర్శించారు. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో కౌశిక్ రెడ్డి కలియతిరిగారు. బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు.

వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం వున్నదన్నారు.

‘‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి అంటూ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ పాల్గొన్నారు.

Related posts

మంద కృష్ణమాదిగతో ములుగు జిల్లా సాధన సమితి భేటీ

Satyam NEWS

మినీ గురుకుల పాఠశాలను పున:ప్రారంభించాలి

Satyam NEWS

నెఫ్ట్ ద్వారా ఇక 24 గంటలూ నగదు బదిలీ చేసుకోవచ్చు

Satyam NEWS

Leave a Comment