మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించకూడదని విజయనగర డీఎస్పీ అనిల్ స్పష్టం చేసారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో రాజీవ్ క్రీడా ప్రాంగణంలో కౌంటింగ్ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసారు. దాదాపు అయిదు కిలోమీటర్ల పరిధిలో వాహనాలు నిషేధమని అలాగే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు…పోలీసులు.
బందోబస్తు గురించి డీఎస్పీ మాట్లాడుతూ…ఫలితాలు వెలువడిన అనంతరం ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహణ నిషిధ్ధమని డీఎస్పీ తెలిపారు.