తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా అంబర్ పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ భారీ ర్యాలీలో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. అనంతరం అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ సమాజం విముక్తం పొందిన ఇది చారిత్రాత్మక దినమని ఆయన అన్నారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్