భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని శ్రీ సీత రామచంద్ర స్వామి దేవాలయాన్ని పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. తిరిగి సాయంత్రం 7.30 గ్రహణ గడియలు పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు. అయితే అర్చకులు తలుపులు తెరిచినప్పటికి భక్తులకు దర్శనం వుండదు. ఆలయంలోని శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం స్వామివారి దర్శనం పునః ప్రారంభం జరుగనున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు, రేపు తెల్లవారుజాము నుంచి యధావిధిగా భక్తులకు దర్శన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.