లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వాహనాలను నేడు రామగుండం పోలీసులు పెద్ద ఎత్తున సీజ్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చెన్నూర్ క్రాస్ రోడ్ వద్ద నేడు చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను పెద్ద ఎత్తున తనిఖీ చేశారు.
చెక్ పోస్ట్ వద్ద రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ స్వయంగా వాహనాలను అపి తనిఖీ చేశారు. ఎటువంటి కారణాలు లేకుండా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిని ఆయన అడ్డుకున్నారు. బైక్ పై ఇద్దరు వెళ్తున్నా, కార్ లలో ఇద్దరు కన్నా వెళ్తున్నా వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
సీపీ సత్యనారాయణతో బాటు అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజవ్, జైపూర్ ఏసీపీ నరేందర్ శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్ పోలీసు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు.