37.2 C
Hyderabad
May 2, 2024 11: 57 AM
Slider నల్గొండ

రమేష్ రెడ్డికి పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం హర్షణీయం

#RameshReddy

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచేలా కృషి చేస్తున్న పటేల్ రమేష్ రెడ్డికి శ్రమను గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం హర్షణీయమని డీసీసీబీ మాజీ చైర్మన్ ముదిరెడ్డి రమణారెడ్డి,కౌన్సిలర్ షఫీఉల్లాలు అన్నారు. శనివారం ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో రాష్ట్ర పటేల్ రమేష్ రెడ్డిని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ అభిమానులతో కలిసి శనివారం జిల్లా కేంద్రంలోని పటేల్ నివాసం వద్ద రాత్రి బాణసంచాలు పేల్చి,స్వీట్స్ పంపిణీ చేశారు.

ఈ సంధర్భంగా వారిరువురు మాట్లాడుతూ సూర్యాపేట నియోజక వర్గంతో పాటు జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడు పటేల్ అని,ఇటీవలి కాలంలో పార్టీ సభ్యత్వ నమోదులో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని అధికారoలోకి తీసుకురావడమే లక్ష్యంగా పటేల్ పని చేస్తున్నాడని చెప్పారు. అందులో భాగంగానే సూర్యాపేట పట్టణంలో పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు.

మున్ముందు ఇదే ధోరణిలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు.పార్టీ కోసం అవిశ్రాoతంగా పని చేస్తున్న పటేల్ రమేష్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చూడాలని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామనే ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు శ్రీనివాస్,వెలుగు వెంకన్న, నామ ప్రవీణ్,పిల్లల రమేష్ నాయుడు,యాట వెంకన్న, బద్దం విజయ్, శ్రీమాన్, మెరెడ్డి ఉపేందర్,పిల్లల సురేష్,లింగరాజు,గద్వాల ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రూపొందించిన సినిమానే రైతన్న

Satyam NEWS

హేట్సాఫ్: ఆ కుటుంబానికి వీరే ఆపద్భాంధవులు

Satyam NEWS

పౌరసరఫరాల సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి

Bhavani

Leave a Comment