29.7 C
Hyderabad
April 29, 2024 10: 29 AM
Slider హైదరాబాద్

పేద ముస్లింలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రంజాన్ తోఫా

#MLA Maganti Gopinath

కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకు వచ్చి పేద ప్రజలకు ఆహారం అందిస్తున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు తన సొంత ఖర్చుతో మరో వినూత్న పథకం రూపొందించారు. తన నియోజకవర్గంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ఉపాధికి దూరమై ఇబ్బందులు పడుతున్న పేద ముస్లింలకు ఆయన రంజాన్ తోఫా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పండుగ వచ్చినా కులమతలకు అతీతంగా హిందూ ముస్లింలు కలిసి జరుపుకుంటామని, ఈ సారి కరోనా కారణంగా పేద ముస్లింలు ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ప్రభుత్వం సమానంగా చేస్తుందని ప్రకటించారని, అదే ఆనవాయితీని తాము ఫాలో అవుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.

రేపటి నుంచి ప్రతి డివిజన్లో సొంతంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ల పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  తెలిపారు. నేడు రహమత్ నగర్ డివిజన్ లో పది వేల మంది నిరుపేద ముస్లింలకు ముస్లిం రంజాన్ గిఫ్ట్ లు సిద్ధం చేశారు.

Related posts

పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం: పరుగులు తీసిన జనం

Satyam NEWS

అన్న క్యాంటీన్ త్వరలో ప్రారంభిస్తాం

Satyam NEWS

ద్రౌపది గా వస్తున్న దీపికా పదుకొనే

Satyam NEWS

Leave a Comment