రావిపాడు-నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారిపై దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి నిరసన చేపట్టిన ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
సమితి అధ్యక్షుడు డా॥గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగార్లపాడు గ్రామస్తులు ఈ అంశంపై పెద్ద ఎత్తు ఉద్యమం చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును, పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ను స్పందనలో కలసి రోడ్డు మరమ్మతులు చేయించాలని రెండు సార్లు అర్జీలను అందించారు.
గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చేపట్టిన ఉద్యమ పోరాట ఫలితంగా నేడు కాంట్రాక్టర్ రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డు మరమ్మతుల గురించి పోరాడి ఉద్యమ విజయం సాధించిన డా॥గోదా రమేష్ కుమార్ ను, ఉద్యమానికి సహకరించిన గ్రామస్తులైన గాదె రాఘవరెడ్డి, అచ్చి అంకిరాజు, అచ్చి పెదరాజు, అన్నపురెడ్ది అంకిరెడ్డి, ద్రోణాదుల పెద్దిరెడ్డి, చిరంజీవి, నాగరాజు, చిలకా నాగయ్య, కొమ్మాలపాటి మాణిక్యరావు, కొమ్మాలపాటి శేషగిరి, సిహెచ్ అనురాధ రెడ్డిలను మాచవరం, విప్పర్ల, రెడ్డిపాలెం గ్రామస్తులు అభినందించారు.