బిచ్కుంద మండలంలో కందుల డబ్బులను రైతుల ఖాతలో నేరుగా జమ చేయాలంటూ భాజపా అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి తహశీల్దార్ వెంకటరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ కందులను ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం అమ్మి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి ఖాతాలో రూపాయి కూడా జామ కాలేదని ఆయన అన్నారు.
రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం శనివారం బిచ్కుంద తసిల్దార్ కార్యాలయంలో తహశీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. తక్షణం కందుల డబ్బులు జామ చేయాలని, సిసిఐ ద్వారా రైతుల దగ్గర మిగిలి ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని, ఆయా రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్న హమాలీలకు, హమాలి డబ్బులు అంద చేయాలని వినతిపత్రం లో పేర్కొన్నారు.
ఇందులో బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్ పసికె ప్రకాష్ మంచి సిద్దిరాములు, సంతోష్ రెడ్డి నంది రాజు గంగారం తదితరులు పాల్గొన్నారు.