తమిళ ఎర్రచందనం కూలీలు రాజంపేట ఫారెస్ట్ డివిజనల్ లో ఎర్రచందనం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా రాజంపేట ఫారెస్ట్ డివిజన్ రోళ్ల మడుగు లోని జల్లిమడుగు వద్ద గురువారంఫారెస్ట్ అధికారుల కూంబింగ్ నిర్వహించారు.
ఈ కుంబింగ్ లో అటవీశాఖ సిబ్బందిని చూసి ఎర్రచందనం కూలీలు పరారీ అయ్యారు. 5 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు,75 లక్షల విలువ చేసే 66 ఎర్రచందనం దుంగల స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు ఇంచార్జ్ డిఎఫ్ఓ నరసింహారావు,రేంజర్ నారాయణ. రైల్వే వంతెన సమీపంలోని ఎర్రచందనం గోడౌన్ వద్ద మీడియా సమావేశంలో వారిని హాజరు పరిచి వివరాలను వెల్లడించారు.
వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.