గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ వర్గాలయిన షెడ్యూల్ కులాలు, ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది.
రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు రాజసింగ్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి, కేసు నమోదు చేయాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో పీవీ రావు మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య, చింత్రియాల నాగయ్య, మైనార్టీ నాయకులు ఎండి అజీజ్ పాషా,వీరయ్య గల్లా వెంకటేశ్వర్లు, మేకల కోటేశ్వరరావు, లక్ష్మణ్, నరసింహారావు, సేలం స్వరూప, బయ్యారపు రవీంద్ర, జ్యోతి, ఎస్ రాములు, కె నాగలక్ష్మి, ఎం శరత్, సిహెచ్ వెంకటేశ్వర్లు, మేళ్లచెరువు వెంకన్న, మంద వెంకటేశ్వర్లు, ఎన్ గోపి, మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు.