37.2 C
Hyderabad
April 26, 2024 22: 19 PM
Slider ఆంధ్రప్రదేశ్

బాలా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ

pjimage (2)

విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు రెండో రోజు జగన్మాత దుర్గమ్మ బాలా త్రిపుర సుంద‌రీదేవిగా దర్శనం ఇస్తున్నది. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు. అమ్మ‌వారికి ఆకుప‌చ్చ‌, ఎరుపు, పసుపు రంగు చీర‌లు క‌ట్టి పాయ‌సం, గారెల‌ను నైవేద్యంగా నివేదిస్తారు.

Related posts

ఎర్రగొళ్ల మల్లేష్ యాదవ్ కు ఘన సత్కారం

Bhavani

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతా గోపీనాథ్

Sub Editor

షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment