గత మూడు సంవత్సరాలుగా నిలిపివేసిన మూడవ రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికను వెంటనే అమలు చేసి దాని సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు ఆ పెరిగిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఒంగోలు టౌన్ లో జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని నేడు ఆయన ప్రసంగించారు. నూతన నాలుగవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని తక్షణమే నియమించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12918 సర్పంచ్ లు అందరూ కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి (కర్నూల్ జిల్లా), యేజర్ల వినోద రాజు (విశాఖ జిల్లా), సింగంశెట్టి సుబ్బరామయ్య (చిత్తూరు జిల్లా), అన్నెపు రామకృష్ణ నాయుడు (శ్రీకాకుళం జిల్లా), ముల్లంగి రామకృష్ణారెడ్డి (కృష్ణాజిల్లా), చుక్కా ధనుంజయ్ యాదవ్ (చిత్తూరు), మునిరెడ్డి (కడప జిల్లా), రావిపాటి సంధ్య, రామినేని శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.