కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో డెబ్బై రెండవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్బంగా జుక్కల్ శాసనసభ్యులు హనుమంతు షిండే బిచ్కుంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం జుక్కల్ మండల కేంద్రంలోని తన క్యాంపు ఆఫీస్ లో జెండా ను ఆవిష్కరించారు.
అయా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు,మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షులు,ఆయా గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయా మండలాల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.