గణతంత్ర దినోత్సవం సందర్బంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరాడంబరంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. 9.45 నిమిషాలకు జిల్లా ఎస్పీ మనోహర్ వేడుకల ప్రాంగణానికి చేరుకోగా 9.56 నిమిషాలకు కలెక్టర్ చేరుకున్నారు. జిల్లా ఎస్పీ మనోహర్, ఆర్డీఓ నాగలక్ష్మి కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ విప్ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్ మనుచౌదరి, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, పాత్రికేయులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్