28.7 C
Hyderabad
April 26, 2024 08: 29 AM
Slider నిజామాబాద్

రేవంత్ క్షమాపణ చెప్పాలి: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు భానుప్రసాద్

#kamareddy

నిన్న కామారెడ్డి పట్టణంలో హత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని కామారెడ్డి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ డిమాండ్ చేశారు.  టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బిఅర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షుడు భాను ప్రసాద్ మాట్లాడుతూ.. కొడంగల్ లో చెల్లని రూపాయి కామారెడ్డి పట్టణానికి వచ్చి ఇక్కడ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పై అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పై షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డిలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ యువజన విభాగం నేతలు అగ్గి రవీందర్, మైనార్టీ జనరల్ సెల్ సెక్రెటరీ  మాజిద్ ,భిక్నూర్ మండల అధ్యక్షులు బుర్రి రంజిత్ వర్మ, మాచారెడ్డి మండల అధ్యక్షులు అజీజ్, రాజంపేట మండల నాయకులు భాస్కర్ బిబిపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి, నీల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాబిచ్యువల్ మిస్టేక్: విక్టరీ వెంకటేష్ ఓటు ఇప్పుడు కర్నూలులో

Satyam NEWS

(Best) < Prediabetes Metformin

Bhavani

రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

Leave a Comment