అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, రన్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండలోని పలు అనాధ ఆశ్రమాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించినట్లు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెటంట్ డా.కె.అనితారెడ్డి తెలిపారు. లార్డ్ వృద్ధ ఆశ్రమం, స్వధార్ మహిళా ఆశ్రమం, స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమం, స్వయంకృషి వృద్ధ ఆశ్రమం లకు బియ్యం బస్తాలు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించామని తెలిపారు.
ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అని, అవసరార్థులకు భోజనం కోసం సహకరించడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని అన్నారు. కోవిడ్ సమయంలో దాతలు ముందుకు రాక ఎన్నో ఆశ్రమాలు ఇబ్బంది పడుతున్నాయని, ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర సహకరించాలని, తమ వంతుగా ఈ కార్యక్రమం చేసామని అన్నారు. ఈ కార్యక్రమంతా శ్రీకాంత్, ప్రియాంక, లలిత, శైలజ, నరేష్, సుచరిత పాల్గొన్నారు.