38.2 C
Hyderabad
April 29, 2024 13: 20 PM
Slider గుంటూరు

వినుకొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

#VinukondaRoadAccident

గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్త పాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

మంగళవారం తెల్లవారుజామున వలస కూలీల టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

అందుగుల కొత్తపాలెం లక్ష్మక్క వాగు బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో  భీముడు (50) యర్నాల శ్రీనివాసరావు (7) మరో వ్యక్తి మృతి చెందారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతం నుండి గుంటూరు జిల్లాలో పనుల కోసం టాటా ఏస్ వాహనంలో వస్తుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ప్రమాదం సంభవించింది.

డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

Related posts

డ్రంక్ అండ్ డ్రైవ్ పై విజయనగరం పోలీసులు అలెర్ట్…….!

Satyam NEWS

కడప జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

Satyam NEWS

టిడిపి కార్యాలయాలపై దాడులను ఖండించిన రఘురామ

Satyam NEWS

Leave a Comment