గత నెల 24 వ తేదీన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది.
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకాల ఉన్న రోడ్డులో ఒక తల్లి తన ముగ్గురు పిల్లలతో వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
ద్విచక్ర వాహనం పై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు యువకులు అతివేగంతో దూసుకు వచ్చారు. అక్కడే రోడ్డు దాటుతున్న బాలికను ఢీ కొట్టి ఆపకుండా పరారయ్యారు.
బాలికకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది.
ఢీ కొట్టిన వారు ఎవరో తెలియకపోవడంతో సంఘటన బయటకు రాలేదు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ వాహనానికి ముందు వైపు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ద్విచక్ర వాహనం నడిపిన యువకులను పట్టుకునేందుకు పోలీసులు వీలుకాలేదు.
అయితే యువకుల ఫొటో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో ఆ ముగ్గురు శనివారంనాడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.