32.7 C
Hyderabad
April 27, 2024 00: 39 AM
Slider ముఖ్యంశాలు

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్: తప్పు చేసిన యువకుల లొంగుబాటు

#RoadAccident

గత నెల 24 వ తేదీన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది.

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకాల ఉన్న రోడ్డులో ఒక తల్లి  తన ముగ్గురు పిల్లలతో వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

ద్విచక్ర వాహనం పై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు యువకులు అతివేగంతో దూసుకు వచ్చారు. అక్కడే రోడ్డు దాటుతున్న బాలికను ఢీ కొట్టి ఆపకుండా పరారయ్యారు.

బాలికకు తీవ్రగాయాలు కావడంతో  స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది.

ఢీ కొట్టిన వారు ఎవరో తెలియకపోవడంతో సంఘటన బయటకు రాలేదు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా  గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ వాహనానికి ముందు వైపు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ద్విచక్ర వాహనం నడిపిన యువకులను పట్టుకునేందుకు పోలీసులు వీలుకాలేదు.

అయితే యువకుల ఫొటో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో ఆ ముగ్గురు శనివారంనాడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

Related posts

తెలుగు రాష్ట్రాలో పలుచోట్ల NIA సోదాలు

Satyam NEWS

ప్రభుత్వ కార్యాలయాలకు నిర్మించడానికి స్థల సేకరణ

Bhavani

కేంద్రం నిషేధించిన 59 చైనా యాప్ ల వివరాలు

Satyam NEWS

Leave a Comment