డిశంబర్ నెలాఖరు నాటికి గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కమీషనర్ హేమమాలిని స్పష్టం చేశారు. ఇటీవల తరచుగా కురుస్తున్న వర్షాలు,ఇతర సమస్యల వల్లనే రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం చోటు చేసుకుందని తెలిపారు.
గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి న్యూ ఇండియా హోటల్ వద్ద నుండి నిర్మాణం జరగనున్న అసంపూర్తి డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆమె సోమవారం శంఖుస్థాపన చేశారు.
అనంతరం కమీషనర్ మీడియా తో మాట్లాడుతూ,14 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.24 లక్షలతో 172 మీటర్లు డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
మూడు చోట్ల కల్వర్టులను నిర్మాణం జరుపుతున్నట్లు చెప్పారు.ఈ పనులు పూర్తయ్యాక రోడ్డు విస్తరణ పనుల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే రోడ్డు కిరువైపులా విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
పలు కారణాల వల్ల విస్తరణ పనుల్లో జాప్యం చోటు చేసుకుందని,డిశంబర్ నెలాఖరు కల్లా రోడ్డు విస్తరణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీ ఈ కృష్ణారెడ్డి,టిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.