కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లింబూర్ గ్రామం వద్ద పోతంగల్ లింబూర్ కుర్ల గ్రామాలకు ఇరవై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న రెండు వరుసల రహదారి పనులను రహదారుల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. ముందుగా మంత్రికి స్థానిక జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పనులను ప్రారంభించిన ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మహార్దశ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతి గ్రామానికి రహదారి నిర్మించేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతుందని జుక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్డుకు నిధులు కేటాయించేందుకు శాసన సభ్యులు హనుమంత్ సిండే తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన తీరును మంత్రి అభినందించారు.
నియోజక అభివృద్ధి కొరకు షిండే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జహి రాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే నియోజకవర్గ స్థాయి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.