ములుగు జిల్లా ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన కుక్కల రోహిత్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు.
ముంబయి వేదికగా ఈ మధ్య ఆన్ లైన్ లో జరిగిన న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంకు(ఎన్.ఎల్. పి ) రోహిత్ హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.
ఆయన ప్రతిభకు మెచ్చి వారు మాస్టర్ ట్రైనర్ గా గుర్తించి మంగళవారం నాడు రోహిత్ కు ప్రతిభ పత్రాన్ని అందజేశారు. ఈ విషయం తెలిసిన తల్లితండ్రులు, బంధుమిత్రులు,పలువురు రోహిత్ ను అభినందించారు.