ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం చేపట్టిన బహు జన గర్జన జయప్రదం చేయాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజక వర్గం రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురుకుల విధ్యా వ్యవస్థను సమూలంగా మార్చివేసి దేశవ్యాప్తంగా జ్ఞాన విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ అని, సంవత్సరాలుగా దేశ సేవ చేసి లిప్ అధికారిగా, గురుకులాల సెక్రటరీ గా అందించిన సేవలు నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.
ప్రజలు రాజకీయ నాయకుల కపట నాటకాలతో మోసపోతున్నారని గ్రహించి తన విలువైన ఆరున్నర సంవత్సరాల లిప్స్ సర్వీసు ను తృణప్రాయంగా వదిలేసి ప్రజా జీవితంలోకి వస్తున్నారని వారన్నారు. ఒక అధికారిగా ఎందరో పేదల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు అందించిన ఆర్.ఎస్. పి. రాజకీయాల్లో కూడా విజయం పొంది గొప్ప స్థాయికి చేరుకోవాలని వారు కోరుకున్నారు.
రేపు జరగబోయే ఆర్.ఎస్. పి. బహుజన గర్జన కు జన సమీకరణ చేసి ఆర్.ఎస్. పి.కి మద్దతు ప్రకటించాలని తామంతా నిర్ణయించామన్నారు. రాబోయే కాలంలో తీసుకోబోయే నిర్ణయాలతో తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయా పార్టీల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా టిజిపిఏ అధ్యక్షులు యాదసు యాదయ్య, స్వేరో ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకన్న ఫిట్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రమేష్, స్వేరో ఇంటర్నేషనల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మేడి సంతోష్, జిల్లా కమిటీ సభ్యులు సైదులు కుమార్, నరేష్, రామన్నపేట మండలం లో ఇంటర్నేషనల్ అధ్యక్షుడు మేడి శ్రీనివాస్ , గాదె ప్రభాకర్ స్వేరో సర్కిల్ అధ్యక్షులు కక్కిరేణి విజయ్ కుమార్, మంద చంద్రయ్య, నకిరేకంటి రవి, రిశారియా పౌండేషన్ వాలంటీర్ జిల్లా సైదులు, బందెల అశోక్, జోగు నగేష్, కొమ్ము అజయ్, నోముల చిరంజీవి, బొడ్డు అశోక్, కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.