సమాజంలో సనాతన ,భారతీయ, వైదిక సంస్కృతి ని ఫరిడలింపజేసేదే…రాష్ట్రీయ స్వయం సేవక్ పని…ఈ ఉత్సవంతో తాను తెలుసుకున్నానని విజయనగరం జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి బాలాజీ పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఎస్…నిర్వహించే గురుపూజ ఉత్సవం సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్.వీ.ఎన్ లేక్ ఫ్యాలస్ లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
నిన్నటి వరకు… తాను.. ఆర్.ఎస్.ఎస్ అంటే ఏ హిందూ మతానికి చెందిన సంస్థ గా భావించానని అదీ చదివిన పుస్తకాల ద్వారా తెలుసుకున్నానని అయితే అది పూర్తిగా విరుద్దమని సీపీఓ అన్నారు. సనాతన ,భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు.. విలువలతో కూడిన సమాజ నిర్మాణం లో ఆర్.ఎస్ ఎస్ పాత్ర అనిర్వచనీయం అని బాలాజీ అన్నారు. ఈ గురుపూజ సందర్భంగా ఏ వ్యక్తి నో…మరే ఫోటో నో గురువు గా తీసుకుంటారని తాను ఇంత వరకు భావించానని…కానీ ఉత్సవంకు వచ్చాక…ఓ భగవద్వజంను గురువు గా స్వీకరించడం… ప్రత్యక్షంగా చూసానని…అది చాలు… సంఘ్ చేస్తున్న కార్యం అంటే ఏంటోనని సీపీఓ బాలాజీ తెలిపారు.
కార్యక్రమంలో… ఏబీబీ జాతీయ కార్యదర్శి.. అనుగ్రహ భాషణం చేసారు. ఈ కార్యక్రమంలో… డీఆర్ఓ గణపతిరావు,శేఖర్, రమణమూర్తి, కృష్ణంరాజు పరమహంస, జీఎస్ఆర్, నాయుడు, అప్పారావు లతో పాటు దాదాపు 300 మంది పాల్గొన్నారు.