నెల్లూరు జిల్లా లో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్ పెళ్లకూరు మండలం తెంకాయతోపు వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారని పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలియజేశారు.
పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏమైనా గాయాలు అయి ఉంటాయని అక్కడే ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించగా, 108 వాహనం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుoది.
అనంతరం పెళ్లకూరు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వాహనాలను తరలించారు.