ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ స్థాయి ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నిక గురువారం ఏలూరు లో జరిగింది. దెందులూరు నియోజక వర్గ ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడుగా ఏలూరు జిల్లా మెట్రో టి వి ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఎస్ రుషి, ఉపాధ్యక్షుడిగా దెందులూరు ప్రజాశక్తి రిపోర్టర్ టి.
సుమన్ బాబు, కార్యదర్శిగా నిఘా పత్రిక జిల్లా స్టాప్ రిపోర్టర్ తోట వెంకట్రావు, సహాయకార్యదర్శిగా పెన్ పవర్ రిపోర్టర్ జరపాల సీతారాముడు, మరో సహాయ కార్యదర్శిగా పెదపాడు మండల ఉదయం ధ్వని రిపోర్టర్ సోమేశ్వరరావు, కోశాధికారిగా మెట్రో టి వి ఏలూరు రిపోర్టర్ దర్శి సత్యనారాయణ,
ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా న్యూస్ రిపోర్టర్ బేతవోలు విజయ్ కుమార్, కమిటీ మెంబర్ గా జి మహేష్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యం లో నిర్వహించారు.