ఎఫ్.ఎఫ్.ఏ ఆధ్వర్యంలో శంకరమఠంలో అలరించిన పంచరత్నకీర్తనలు
ఎందరో మహానుభావులు…జగదా ఆనంద తారక,దుడుకూ గల…వంటి పంచరత్న కీర్తనలు….మరోసారి కళలకు కాణాచైన విజయనగర వాసులను అలరించాయి.త్యాగరాజ ఆరాధనా ఉత్సవాలలో భాగంగా నగరంలోని శంకరమఠంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్డ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచరత్నకీర్తనల సేవ జరిగింది.ఈ కచేరీలో పదిహేనేళ్ల నుంచీ 60 ఏళ్ల వరకు అందరూ పాల్గొనవచ్చని ఎఫ్ఎఫ్ఏ పేర్కొడంతో చాలామంది సంగీతం నేర్చుకున్న వారందరూ వచ్చి పాడారు.ఇక ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం 623వ కార్యక్రమం,అలాగే సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 175వ ఆరాధానోత్సవం,.అలాగే హరికథా పితామహులు అజ్జాడ ఆధీభట్ల నారాయణదాసుగారి వర్ధంతి కూడా ఒకే రోజు కావడం విశేషం.. ఈమేరకు విజయభావన సభ్యులు డాక్టర్ ఎ. గోపాలరావు . స్థానిక విద్వాంసులు పద్మప్రియ, శైలజ, ఎ. కె.మహాలక్ష్మి, సుభధ్రాదేవి, నిరూపమ, సుజాత, మేడూరి లక్ష్మీ,సంగీతకుమార్, బొల్లాప్రగడ లోకనాధస్వామిలు గాత్రంలో పాల్గొనగా… వయోలిన్ పై రామాచరణ్, మృదంగంపై రవి, శివకుమార్, సుధాకర్, సహకారం అందించారు. కాగా జమ్మఅప్పన్న బృందం నాదస్వరం తో దూసి శివరాం శర్మ , త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని పట్టుకుని నగరం మొత్తం తిరువీధి కార్యక్రమం జరిగింది. అనంతం పాకాల సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు…డాక్టర్ అయ్యగారి రాఘవరావు సమర్పించగా కార్యదర్శి డాక్టర్ మండపాక రవి కార్యక్రమం నిర్వహించగా అధ్యక్షులు ధవళ సర్వేశ్వర రావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.