గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో స్థానిక కోట సెంటర్ లోని క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ లో శ్రీ సాయి హోమియో క్లినిక్ ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు హోమియో వైద్యంలో అత్యంత ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్స అందించేందుకు శ్రీ సాయి హోమియో క్లినిక్ వైద్య బృందం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని సంబంధిత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. డా౹౹చదలవాడ హోమియో క్లినిక్ యాజమాన్యంను, దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డా౹౹చదలవాడ వెంట నరసరావుపేట సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,డా౹౹లక్కిరెడ్డి వేంకటేశ్వర్ రెడ్డి, జగన్నాథం, వేముల పాండు, సుభాని మరియు ప్రముఖ డాక్టర్లు ఉన్నారు.
previous post