40.2 C
Hyderabad
April 29, 2024 16: 26 PM
Slider గుంటూరు

శ్రీ సాయి హోమియో క్లినిక్ ను ప్రారంభించిన చదలవాడ

#chadalawada

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో స్థానిక కోట సెంటర్ లోని క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ లో శ్రీ సాయి హోమియో క్లినిక్ ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు హోమియో వైద్యంలో అత్యంత ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్స అందించేందుకు శ్రీ సాయి హోమియో క్లినిక్ వైద్య బృందం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని సంబంధిత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. డా౹౹చదలవాడ హోమియో క్లినిక్ యాజమాన్యంను, దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డా౹౹చదలవాడ వెంట నరసరావుపేట సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,డా౹౹లక్కిరెడ్డి వేంకటేశ్వర్ రెడ్డి, జగన్నాథం, వేముల పాండు, సుభాని మరియు ప్రముఖ డాక్టర్లు ఉన్నారు.

Related posts

ఎమ్మెల్యేలతో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

Satyam NEWS

ఆనాడే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు

Satyam NEWS

కుటుంబ సభ్యులు వీడియో తీస్తుండగానే ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment