మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం ముమ్మాటికి కోర్టు దిక్కరనే అవుతుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు, బాధ్యతారహితంగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లో ఉండగానే, మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని సజ్జల పేర్కొనడం కోర్టు ధిక్కరనే అవుతుందని వెల్లడించారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని చెప్పి మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.