జగనన్న వదిలిన బాణానికి సాక్షి టివిలో ఏ మాత్రం ప్రచారం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.
కేవలం ఫాస్ట్ న్యూస్ లో ఒక సెంటెన్సు చదవి వదిలేసిన సాక్షి టివి, అదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను మాత్రం పదే పదే చూపించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
వై ఎస్ షర్మిలా రెడ్డి తమను కాదని పార్టీ పెట్టుకున్నారని ఆఘమేఘాలమీద ఖండన ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందా అని కూడా రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు.
పార్టీ పెట్టడానికి ఇంకా సమయం ఉందని షర్మిలారెడ్డి చెప్పారు.
అయితే ఈ లోపునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిలా రెడ్డి తమ మాట కాదని వెళ్లిపోయారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని కొందరు అంటున్నారు.