సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శానంపూడి అంకిరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఆశయం తోనే రాజకీయాల్లోకి వచ్చానని, నీతివంతమైన పాలన అందించి ప్రజా సేవలో చెరగని ముద్ర వేయాలనేది తన తండ్రి ఆశయమని అన్నారు. దివంగత నేత శానంపూడి అంకిరెడ్డి కూడా ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే వారని,తనతో ఎప్పుడు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉండేవారని అన్నారు.
అన్ని వేళలా ప్రజల మనస్సులో, ప్రజా సేవలో ఉంటూ నిజమైన రాజకీయ నాయకుడుగా నిలిచారని, తాను కూడా అదే స్ఫూర్తితో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని,హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించే విధంగా అడుగులు వేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సైదిరెడ్డి కుటుంబ సభ్యులు,బంధువులు పాల్గొని అంకిరెడ్డి కి ఘన నివాళులు అర్పించారు.