28.7 C
Hyderabad
April 27, 2024 07: 00 AM
Slider కృష్ణ

కృష్ణానది వరదలో చిక్కుకున్న ఇసుక లారీ డ్రైవర్లు కూలీలు

#krishna river

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లారీ డ్రైవర్లు, ఇసుక కూలీలు కృష్ణానదిలో చిక్కుకున్నారు.

సుమారు 150 మంది డ్రైవర్లు కూలీలు రోజువారీ ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి తవ్వకాల నిమిత్తం కృష్ణా నది కి వెళ్ళారు.

ఒక్కసారిగా కృష్ణానది కి వరద ప్రభావం ఎక్కువ అవటంతో వీరంతా కృష్ణా నది లో చిక్కుకున్నారు. సుమారుగా 100 లారీలు  150 మంది డ్రైవర్లు ఇసుక కూలీలు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు కృష్ణా నది కి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్లను ఇసుక కూలీలను పడవల ద్వారా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

వలంటీర్ల సేవలకు బహుమతి ప్రదానోత్సవ సభలో నాసిరకం స్నాక్స్

Satyam NEWS

నవ్యాంధ్రప్రదేశ్ ను గంజాయి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశారు

Satyam NEWS

డ్యామేజ్ కంట్రోల్ కోసం దీదీ ప్రయత్నాలు

Satyam NEWS

Leave a Comment